శుక్రవారం, 5 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 21 జనవరి 2024 (22:20 IST)

22న రామ్ లల్లా ప్రాణప్రతిష్ట.. పలు రాష్ట్రాల్లో సెలవుతో పాటు డ్రై డే

ram mandir
అయోధ్య రామ మందిరంలో రామ్ లల్లా ప్రాణప్రతిష్ట కార్యక్రమం సోమవారం జరుగనుంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని పురస్కరించుకుని దేశంలోని పలు రాష్ట్రాలు ఒక రోజు సెలవు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం కూడా దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు అర పూట సెలవు ప్రకటించాయి. అలాగే, అనేక రాష్ట్రాలు పాఠశాలలకు సెలవులు ప్రకటించాయి. మరికొన్ని రాష్ట్రాలు ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవు ప్రకటించాయి. అయితే, ఏయే రాష్టరాల్లో పూర్తిగా సెలవులు ఉన్నాయి.. ఆ వివరాలేంటో పరిశీలిస్తే, 
 
జనవరి 22వ తేదీన పబ్లిక్ హాలిడేగా ప్రకటించిన రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. కేవలం సెలవు మాత్రమే కాకుండా డ్రై డేగా ప్రకటించాయి. ఈ పవిత్రోత్సవం రోజున మద్యం లేదా మాంసాహారం అందించే దుకాణాలు మూసివేయాలని ఆదేశించాయి. అలాగే, ఢిల్లీ, యూపీ, మధ్యప్రదేశ్, అస్సాం, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, త్రిపుర, గోవా, మహారాష్ట్ర రాష్ట్రాలు డ్రైడేగా ప్రకటించాయి. 
 
ఇంకోవైపు, జనవరి 22వ తేదీన అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు అరపూట సెలవు ప్రకటించాయి. ఉద్యోగులకు వేడుకల్లో పాల్గొనేలా చేయడానికి ఈ మేరకు నిర్ణయించారు. అయితే, ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్స్ జనవరి 22వ తేదీన హాఫ్‌డే సెలవు ప్రకటించి, ఆ తర్వాత తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఇంకోవైపు, త్రిపుర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా, అస్సాం, రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు కూడా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు అరపూట సెలవు ప్రకటించాయి.