శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 6 నవంబరు 2021 (14:56 IST)

అక్రమ సంబంధాన్ని వద్దన్నాడనీ భర్తను పత్తిచేనులోకి తీసుకెళ్లి అడ్డంగా నరికేసిన భార్య..

తన ప్రియుడితో కొనసాగిస్తున్న అక్రమ సంబంధాన్ని మానుకోవాలంటూ హితవు పలికడమే కాకుండా అడ్డుగా ఉన్నాడని భావిన ఓ భార్య అత్యంత కిరాతక చర్యకు పాల్పడింది. భర్తను పత్తి చేనులోకి తీసుకెళ్లి ప్రియుడి సాయంతో అడ్డంగా నరికేసింది. ఈ దారుణం రంగారెడ్డి జిల్లా పూడూరు మండలం చన్గోముల్ గ్రామంలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, స్థానిక ఎస్ఐ చెప్పిన వివరాల ప్రకారం.. గ్రామాకి చెందిన ఎరుకల వెంకటయ్య(30), మాధవి(26) దంపతులు. కొంతకాలంగా అదేగ్రామానికి చెందిన శేఖర్‌తో మాధవి అక్రమసంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసి వెంకటయ్య పలు మార్లు భార్య మాధవిని హెచ్చిరించాడు. అయినా ఆమె భర్త మాటను పెడచెవిన పెట్టింది. 
 
తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తెలిసి భర్తను అడ్డు తొలగించుకోవాలని మాధవి, శేఖర్లు భావించారు. ఈ క్రమంలోనే వెంకటయ్యను కిరాతంగా హత్య చేశారు. గ్రామానికి సమీపంలో ఉన్న పత్తి చేనులో వెంకటయ్యను చంపేశారు. వెంటకయ్య కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు వివారాలు సేకరిచారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నారు.