1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 15 ఏప్రియల్ 2021 (12:33 IST)

దేశాన్ని కార్పొరేట్ శక్తుల నుంచి కాపాడాలి : తికాయత్

కేంద్రం తెచ్చిన మూడు వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న భారతీయ కిసాన్ యూనియన్ నేతర రాకేష్ తికాయత్... తాజాగా దేశ ప్రజలకు మరో పిలుపునిచ్చారు. దేశాన్ని కార్పొరేట్ శక్తుల నుంచి కాపాడాలని ఆయన కోరారు. ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన చేస్తున్న రైతులను ఉద్దేశించి ఆయన ప్రసంగింస్తూ, ‘సేవ్‌ కాన్‌స్టిట్యూషన్‌, సేవ్‌ ఫార్మర్‌’ అనే నినాదాన్ని ఇచ్చారు. 
 
‘కేంద్ర ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని పట్టించుకోవడం లేదు. కేవలం కంపెనీల గురించే ఆలోచిస్తోంది. ప్రభుత్వం భాజపా చేతిలో కాకుండా.. కంపెనీల చేతిలో నడుస్తోంది. కాబట్టి దేశాన్ని ఈ కంపెనీల రాజ్యం నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది. కాంట్రాక్ట్‌ ఫార్మింగ్‌ పేరుతో పలు కంపెనీలు రైతుల భూములపై కన్ను వేశాయి. కేంద్రం దేశాన్ని ఆయా కంపెనీలకు అమ్ముతోంది’ అని టికాయిత్‌ ఆరోపించారు. 
 
ఈ సందర్భంగా భీమ్‌ ఆర్మీ చీఫ్‌ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విభజించు, పాలించు విధానాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. అన్ని కులాలు, మతాలు సమానమే.. కాబట్టి నియంతలా వ్యవహరిస్తున్న ప్రభుత్వానికి దీటుగా బదులివ్వాలివ్వాలని పిలుపునిచ్చారు. 
 
కేంద్రం తెచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా గతేడాది నవంబర్‌ నుంచి దిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయమై నిరసన చేస్తున్న రైతులతో కేంద్రం దఫాల వారీగా చర్చలు నిర్వహించినప్పటికీ సమస్య కొలిక్కి రాలేదు. దీంతో ప్రభుత్వం ఆ మూడు చట్టాలను వెనక్కి తీసుకునే వరకు రైతుల ఆందోళనలు కొనసాగుతాయని చెప్పారు.