శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (16:36 IST)

సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం కిరణ్ బేడీకి లేదు : మద్రాస్ హైకోర్టు

పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీకి మద్రాసు హైకోర్టు మదురై బెంచ్ తేరుకోలేని షాకిచ్చింది. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం సాగిస్తున్న పాలనలో వేలెట్టరాదనీ, మంత్రివర్గాన్ని సంప్రదించకుండా ఎలాంటి సొంత నిర్ణయాలు తీసుకోరాదని స్పష్టం చేసింది.
 
కేంద్ర పాలితప్రాంతమైన పుదుచ్చేరిలో కాంగ్రెస్ సారథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్‌గా కిరణ్ బేడీని నియమించింది. ఆమె ప్రభుత్వ పాలనలో జోక్యం చేసుకోవడం, సొంత నిర్ణయాలు తీసుకుని అమలు చేయడంసాగారు. దీంతో ముఖ్యమంత్రి వి.నారాయణ స్వామికి ఆమెకు మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. ముఖ్యంగా, ఆ రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య కాలేజీల్లోని వైద్య సీట్ల భర్తీలో చేసుకున్న అవినీతి స్కామ్‌పై లోతుగా పరిశీలించారు. ఇలాంటి చర్యలను  పుదుచ్చేరి సర్కారు ఏమాత్రం జీర్ణించుకోలేక పోయింది. 
 
అప్పటినుంచి కిరణ్ బేడీకి, పుదుచ్చేరి ప్రభుత్వానికి మధ్య అంతరం పెరిగిపోయింది. దీనిపై ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ పిటిషన్ దాఖలు చేయడంతో మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ విచారణ జరిపింది. పాలనకు సంబంధించి కిరణ్ బేడీ సొంత నిర్ణయాలు తీసుకోరాదని, ఆమె ఇలాంటి విషయాల్లో ఎలాంటి అధికారాలు లేవని తేల్చి చెప్పింది. పుదుచ్చేరి క్యాబినెట్‌ను సంప్రదించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలని హైకోర్టు మదురై బెంచ్ స్పష్టం చేసింది.