గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 27 ఆగస్టు 2020 (08:32 IST)

బాబాయితో రాసలీలలు.. తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య

తన కూతురు వావి వరసలు మరిచి బాబాయి వరసయ్యే వ్యక్తితో అక్రమ సంబంధం నెరపడమే కాకుండా కూతురి బెడ్‌రూమ్‌ రాసలీలల వీడియోల బయటకు రావడంతో మనస్తాపానికి గురైన ఆమె తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ ఘటన తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా నారియప్పనూర్‌ గ్రామానికి చెందిన మురుగేశన్‌ కుమార్తె శరణ్య (22) కల్లకూరిచిలోని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. అదే పట్టణంలో మురుగేశన్‌కు తమ్ముడు, శరణ్యకు బాబాయి వరసయ్యే మణికందన్‌ ఇంట్లోనే ఉంటూ ఉద్యోగానికి వెళ్తుంది.

ఈ క్రమంలోనే మణికందన్‌ వలలో శరణ్య పడింది. చిన్నాన్న వరసయ్యే వ్యక్తి అని తెలిసి కూడా అతడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఒకే ఇంట్లో ఉండటంతో కుదిరినప్పుడల్లా రాసలీలల్లో మునిగితేలేవారు. ఓ రోజు ఇద్దరూ ఏకాంతంగా గడుపుతున్న సమయంలో మణికందన్‌ భార్య వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది.

దీంతో ఆమె బంధువుల మధ్య పంచాయతీ పెట్టగా ఇద్దరినీ మందలించారు. అయినప్పటికీ వారిలో ఎలాంటి మార్పూ రాకపోగా ఎలాగూ అందరికీ తెలిసిపోయిందని బరితెగించి ఇంటి నుంచి పారిపోయి చెన్నైలో కాపురం పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న శరణ్య తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిని పట్టుకొచ్చి మణికందన్‌పై కేసు పెట్టి జైలుకు పంపించారు.

వారం రోజుల తరువాత ప్రియుడు జైలు నుంచి తిరిగి వచ్చాడని తెలుసుకున్న శరణ్య అతడి వద్దకే వెళ్లిపోయింది. అదే సమయంలో శరణ్యతో బెడ్‌రూమ్‌లో ఏకాంతంగా గడిపిన వీడియోల మణికందన్‌ ఆమె తండ్రికి వాట్సాప్‌లో పంపించాడు. కూతురు చేస్తున్న నీచపు పనికి కుమిలిపోయిన తండ్రి ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.