1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 15 ఫిబ్రవరి 2020 (21:37 IST)

శశి థరూర్‌కు ఢిల్లీ హైకోర్టు జరిమానా..ఎందుకో తెలుసా?

ప్రధానమంత్రి నరేంద్రవెూదీని ఉద్దేశించి పరోక్షంగా చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశి థరూర్‌కు ఢిల్లీ కోర్టు జరిమానా విధించింది.

ఈ వ్యాఖ్యలపై బీజేపీ నాయకుడు రాజీవ్‌ బబ్బర్‌ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో పదేపదే హాజరుకాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు ఆయనకు రూ. 5వేల జరిమానా విధించింది. అనంతరం తదుపరి విచారణను మార్చి 4వ తేదీకి వాయిదా వేసింది.

ఈ విచారణకు హాజరుకావాలని అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్టేట్ర్‌ విశాల్‌ పహుజా ఆయనను ఆదేశించారు. కాగా 2018లో బెంగళూరు సాహిత్య ఉత్సవంలో శశి థరూర్‌ ఈ వివాదాస్పద వాఖ్యలు చేశారు. ప్రధాని వెూదీని శివలింగంపై తేలులా ఆరెస్సెస్‌ వారు భావిస్తుంటారు.

ఆ తేలును చేత్తో తీసేయలేం. చెపðతో కొట్టలేం అనుకుంటుంటారు. ఈ విషయం ఆరెస్సెస్‌లోని ఒక వ్యక్తి ఓ జర్నలిస్ట్‌కు చెప్పారంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే.