1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 7 సెప్టెంబరు 2022 (18:13 IST)

నెల్లూరులో మైనర్ బాలికపై యాసిడ్ దాడి నిందితుడి అరెస్టు

acid
జిల్లా కేంద్రమైన నెల్లూరులో తొమ్మిదో తరగతి చదువున్న మైనర్ బాలికపై యాసిడ్ దాడి చేసింది సొంత మేనమామేనని జిల్లా ఎస్పీ విజయరావు వెల్లడించారు. లైంగిక వాంఛ తీర్చకపోవడంతో ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు తేల్చారు. 
 
దీనిపై ఎస్పీ విజయరావు మాట్లాడుతూ, బాలికపై దాడి కేసులో మేనమామనే నిందితుడని చెప్పారు. సంఘటన జరిగిన తర్వాతే పోలీసులకు సమాచారం వచ్చిందన్నారు. తాను కూడా జీజీహెచ్‌కు వెళ్లి బాలికను పరామర్శించినట్లు తెలిపారు. 
 
బాలికను చెన్నైలోని చిల్డ్రన్స్ అపోలో ఆస్పత్రికి తరలించారన్నారు. ఇంట్లో ఉన్న బాత్రూం యాసిడ్‌తో నిందితుడు దాడి చేశాడని పేర్కొన్నారు. చెవిదిద్దులు ఇవ్వాలని బాలికపై దాడి చేశాడని వివరించారు. 
 
నాగరాజుకు త్వరగా శిక్షపడేలా చూస్తామన్నారు. నిందితుడు నాగరాజుపై రౌడీషీట్‌ ఓపెన్‌ చేశామని స్పష్టం చేశారు. మద్యం మత్తులోనే నాగరాజు బాలికపై దాడి చేశాడని ఎస్పీ చెప్పారు. ఈ మేరకు మీడియాకు ఎస్పీ వివరాలు వెల్లడించారు.
 
'చాకుతో మేనమామే బాలికపై దాడి చేశాడు. సంఘటన జరిగిన తర్వాతే పోలీసులకు సమాచారం వచ్చింది. నేను కూడా జీజీహెచ్‌కు వెళ్లి బాలికను పరామర్శించాను. బాలికను చెన్నైలోని చిల్డ్రన్స్ అపోలో ఆస్పత్రికి తరలించాం. ఇంట్లో ఉన్న బాత్రూం యాసిడ్‌తో నిందితుడు దాడి చేశాడు. చెవిదిద్దులు ఇవ్వాలని.. బాలికపై దాడి చేశాడు. నాగరాజుకు త్వరగా శిక్షపడేలా చూస్తాం. నిందితుడు నాగరాజుపై రౌడీషీట్‌ ఓపెన్‌ చేశాం. మద్యం మత్తులోనే నాగరాజు బాలికపై దాడి చేశాడు' అన తెలిపారు