1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 26 ఏప్రియల్ 2024 (10:23 IST)

వీవీప్యాట్‌లతో వంద శాతం ఓట్ల ధృవీకరణ కేసు : నేడు సుప్రీం తీర్పు

vvpat
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నమోదయ్యే ఓట్ల సంఖ్యను వీవీ ప్యాట్‌ స్లిప్పుల లెక్కింపుతో 100 శాతం సరిపోల్చాలంటూ దాఖలైన కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఈ తీర్పును వెలువరించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉదయం 10.30 గంటలకు తీర్పును వెలువరించనుంది. ఈసీ ప్రతివాదిగా ఉన్న ఈ కేసును అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ సహా పలువురు దాఖలు చేశారు. 
 
బుధవారం సుప్రీంలో కేసు విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఈవీఎంలు, వీవీప్యాట్‌లకు సంబంధించి న్యాయమూర్తులు అడిగిన ప్రశ్నలకు ఎన్నికల సంఘానికి చెందిన నిపుణులు స్వయంగా వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా సుప్రీం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికలను నియంత్రించడం తమ పనికాదని స్పష్టం చేసింది. రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల కమిషన్‌కు తాము మార్గదర్శకాలు జారీ చేయలేమని స్పష్టం చేసింది. దీంతో సుప్రీం వెలువరించే తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.