బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 26 నవంబరు 2020 (13:52 IST)

ప్రియురాలితో రొమాన్స్ చేస్తూ దొరికిపోయిన ప్రియుడు, చితకబాదారు, ఆ తర్వాత అల్లుడ్ని చేసుకుంటున్నారు

రెండునెలలుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రియురాలితో సాగిపోతున్న రొమాన్స్. రాత్రి నుంచి ఉదయం వరకు అదే పని. ప్రియురాలు సహకరించడంతో ప్రియుడి ఆనందానికి అవధుల్లేవు. అయితే ఈ వ్యవహారం మొత్తం ప్రియురాలి ఇంట్లో జరగడం.. ఒకరోజు రాత్రి అడ్డంగా దొరికిపోవడం కాస్త జరిగింది. 
 
ఉత్తరప్రదేశ్ లోని రామ్‌పూర్ పరిధిలోని నగ్లీ గ్రామమది. రాజాసింగ్ డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా తిరుగుతున్నాడు. తనతో పాటు విద్యనభ్యసించిన స్నేహితురాలు అవంతి కూడా డిగ్రీ పూర్తి చేసేసింది. ఇంటి పట్టునే ఉండేది. ఖాళీ సమయాల్లో వీరు ఫోన్లు మాట్లాడుకుంటూ ప్రేమికులుగా మారిపోయారు.
 
అది కూడా కరోనా సమయంలో ఖాళీగా ఉండడంతో ఇద్దరి మధ్యా ప్రేమ బాగానే చిగురించింది. ఆ ప్రేమ కాస్త శారీరక సంబంధానికి దారితీసింది. సరిగ్గా రెండు నెలల నుంచి రాత్రయితే రాజాసింగ్ అవంతి ఇంటికి వెళ్ళడం ఆమె గదిలో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెతో కలవడం లాంటివి చేసేవాడు.
 
మొదట్లో పిచ్చాపాటి మాట్లాడటానికి పిలిచిన అవంతి ఆ తరువాత ప్రియుడితో కమిట్ అయ్యింది. దీంతో వారిద్దరికి అడ్డూఅదుపూ లేకుండా పోయింది. రెండునెలల పాటు ప్రియురాలి ఇంటిలోనే రాజాసింగ్ ఎంజాయ్ చేశాడు. కానీ రెండురోజుల క్రితం అవంతి కుటుంబ సభ్యులకు అడ్డంగా దొరికిపోయాడు.
 
ఇంటిలోనే రాజాసింగ్‌ను చితకబాదారు. ఆ తరువాత పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్ళారు. అయితే రాజాసింగ్ తాను పెళ్ళి చేసుకుంటానని చెప్పడంతో అవంతి కుటుంబ సభ్యులు అతని మీద పెట్టిన కేసులు ఎత్తివేశారు. త్వరలో వారి వివాహం జరుగబోతోంది.