1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 18 నవంబరు 2022 (15:21 IST)

రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్రలో రీయాసేన్

rahul gandhi
కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్రలో పాల్గొనే సినీ తారల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే తెలంగాణలో సాగిన రాహుల్ యాత్రలో పలువురు తారలు మెరిశారు. 
 
ఈ క్రమంలో హైదరాబాద్‌లో జరిగిన రాహుల్ పాదయాత్రలో బాలీవుడ్ నటి పూజాభట్, తెలుగు హీరోయిన్ పూనమ్ కౌర్ పాల్గొన్నారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ జోడో యాత్రలో రియాసేన్ కూడా రాహుల్‌తో కలిసి నడిశారు.
 
భారత్ జోడో యాత్ర పేరిట చేపట్టిన పాదయాత్ర ప్రస్తుతం మహారాష్ట్రలో కొనసాగుతోంది. ఈ క్రమంలో గురువారం..  రియాసేన్ రాహుల్ పాదయాత్రలో పాల్గొన్నారు. రాహుల్‌తో కలిసి నడిచారు.