ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 11 జూన్ 2019 (12:26 IST)

మద్యం సేవించి అతివేగంగా కారును నడిపిన పెద్దాయన.. ఏమైందంటే? (వీడియో)

తమిళనాడు రాజధాని నగరం చెన్నైకి సమీపంలోని తాంబరం వద్ద ఘోరం జరిగింది. చెన్నైలోని తాంబరంలో 54 ఏళ్ల పెద్దాయన కారును అతివేగంగా డ్రైవ్ చేస్తూ.. బారికేడ్లను ఢీకొట్టి ముందుకు నడిపాడు. మద్యం సేవించి కారును అతివేగంగా నడపటంతో అటుగా వచ్చే ఇద్దరు బైకర్లను ఢీకొంది. 
 
ఈ ఘటనపై బైకులపై వెళ్తున్న నలుగురిలో ఇద్దరు గాయపడ్డారు. ఈ రోడ్డు ప్రమాదం అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది. గాయపడిన వాళ్లను స్థానికులు ఆస్పత్రిలో చేర్చారు. పోలీసులు కారు డ్రైవర్ వరధాన్‌ను అరెస్టు చేశారు.
 
ఈ ఘటనపై బైకర్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. ఇదే కారు అంతకంటే.. ముందు జంక్షన్‌ సీసీటీవీ ఫుటేజ్‌లో వుందా లేదా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.

క్రోంపేట ట్రాఫిక్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 338కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.