దేశవ్యాప్తంగా కోవిడ్-19 వైరస్ రోజురోజుకు విజృంభిస్తోంది. ప్రతిరోజు దాదాపు 50 వేల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్-19 బారిన పడకుండా మాస్క్ ధరించడం, తరచూ శానిటైజర్లతో చేతులను శుభ్రం చేసుకోవడం ఎంత ముఖ్యమో.. స్వీయ జాగ్రత్తలు తీసుకుంటూనే సరైన పౌష్ఠిక ఆహారం తీసుకోవడం కూడా అంతే ముఖ్యం.
				  											
																													
									  
	 
	శాఖాహారం తినవలసినవి:
	 
	-- బ్రౌన్ రైస్, గోధుమ పిండి, ఓట్స్ మరియు చిరుధాన్యాలు మొదలగు వాటిని తినండి
				  
	-- బీన్స్, చిక్కుడు మరియు పప్పుధాన్యాలు తినడం ద్వారా శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ పొందగలరు 
				  																								
	 
 
 
  
	
	
																		
									  
	-- ఆహారంలో తాజా పండ్లు మరియు కూరగాయలు (కాప్సికమ్, క్యారెట్, బీట్ రూట్ మరియు వంకాయ మొదలగు వాటిని) చేర్చండి
				  																		
											
									  
	-- రోజులో కనీసం రెండు లీటర్ల గోరువెచ్చని నీటిని త్రాగండి
	-- పుల్లని నిమ్మ పండు, బత్తాయి తీసుకోండి. వీటిలో వ్యాధి నిరోధక శక్తిని కలుగచేయు సి విటమిన్ ఉంటుంది. తద్వారా అంటు సోకే అవకాశాన్ని తగ్గిస్తుంది
				  																	
									  
	-- ఆహారంలో మసాలా ద్రవ్యాలైన అల్లం, వెల్లుల్లి, పసుపు మొదలగు వాటిని చేర్చండి. ఇవి వ్యాధి నిరోధక శక్తి యొక్క సహజత్వాన్ని పెంపొందిస్తాయి.
				  																	
									  
	-- ఇంటిలో వండిన ఆహారాన్ని తినండి. క్రొవ్వు పదార్థాలు మరియు నూనెలను తక్కువగా తినండి
	-- పండ్లను, కూరగాయలను తినడానికి ముందు శుభ్రంగా కడగండి
				  																	
									  
	-- వెన్న తీసిన పాలు మరియు పెరుగును తీసుకోండి. వీటిలో ప్రోటీన్ మరియు కాల్షియం ఎక్కువగా ఉంటుంది.
				  																	
									  
	 
	తినకూడనివి :
	-- మైదా, వేపుళ్ళు మరియు జంక్ ఫుడ్(చిప్స్, కుక్కీస్) తినకండి
	-- శీతల పానీయాలు, ప్యాక్ట్ జ్యూస్ కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగకండి - వీటిలో పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి 
				  																	
									  
	-- చీజ్, కొబ్బరి మరియు పామాయిల్, బటర్ తినకండి. వీటిలో అనారోగ్యాన్ని కలిగించే కొవ్వు పదార్థాలు ఉంటాయి
				  																	
									  
	 
	మాంసాహారం తినవలసినవి :
	-- మాంసాహారాన్ని తాజా పదార్ధాలతో పాటు నిల్వ ఉంచకండి
	-- స్కిన్ చికెన్, చేపలు మరియు గ్రుడ్డు తెల్లసొన మొదలగు వాటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది వీటిని తీసుకొనుటకు ప్రాధాన్యత ఇవ్వండి.
				  																	
									  
	 
	తినకూడనివి :
	-- మాంసం, లివర్, వేపిన మాంసాన్ని తినకండి
	-- వారంలో రెండు నుంచి మూడు రోజులు మాత్రమే మాంసాహారాన్ని తీసుకోండి
				  																	
									  
	-- పూర్తి గ్రుడ్డుని (పచ్చసొనతో కలిపి) వారంలో ఒక్కసారి మాత్రమే తీసుకోండి
	 
	గమనిక: కరోనా వైరస్ సోకిన వారిలో 80 శాతం పైగా రోగులు ఎటువంటి లక్షణాలు కనిపించకపోవచ్చు లేదా స్వల్ప లక్షణాలైన తక్కువ జ్వరం లేక దగ్గు కనిపించవచ్చు. అటువంటి వారు ఆసుపత్రిలో చేరవలసిన అవసరం లేదు ఇంట్లో ఉండవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు.