శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 31 అక్టోబరు 2022 (18:57 IST)

గోపాష్టమి రోజున ఆకుపచ్చని బఠాణీలు, గోధుమలను..?

Gomatha
దీపావళి తరువాత, కార్తీక నెల శుక్లపక్ష అష్టమిని గోపాష్టమి (ఈ ఏడాది నవంబర్ 1న)గా జరుపుకుంటారు. ఈ రోజున అరణ్యంలోకి కృష్ణుడిని వెంట ఆవులను పంపినట్లు విశ్వాసం. అందుకే ఈ రోజున ఆవులు ప్రత్యేకంగా పూజలందుకుంటాయి. ఇలా చేస్తే సమస్త దేవతలు గోమాత ఆరాధనతో సంతృప్తి చెందుతారు. 
 
గోవులకు గోపాష్టమి రోజున పశుగ్రాసం, ఆకుపచ్చని బఠాణీలు, గోధుమలను ఆవుకు పెడితే.. సర్వాభీష్టాలు నెరవేరుతాయి. ఆవులో 33 కోట్ల దేవతలు కొలువైవుంటారు. గోవుకే మాత అనే హోదాను ఇచ్చారు. అలాంటి అమ్మలాంటి గోమాతను పూజించే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెప్తున్నారు. 
 
అందుకే.. గోపాష్టమి రోజున గోవులను శుభ్రమైన నీటితో కడిగి.. పసుపుకుంకుమలతో అలంకరించుకోవాలి. కొమ్ములకు రంగుల దారాలు కట్టాలి. ఆపై అరటి పండ్లను గోమాతకు నైవేద్యంగా ఇవ్వాలి. 
 
కర్పూర హారతినిచ్చి... గోవును మూడు సార్లు ప్రదక్షణలు చేయాలి. గోవు తోక భాగాన్ని స్పృశించి నమస్కరించాలి. గోవుకు వెనుక భాగం నుంచి కర్పూర హారతిని ఇవ్వాలి. 
 
గోవు పరదేవతా స్వరూపము. గోవులకు అధిష్ఠాన దేవత సురభీదేవి. కామధేనువు పరాశక్తియైన లక్ష్మీస్వరూపం. ఈ "శ్రీ సురభ్యై నమః" అనే మంత్రాన్ని జపించి, క్రింది స్తోత్రాన్ని గోసన్నిధిలో పఠిస్తే, ఆయురారోగ్యైశ్వర్యాలు, అభీష్టసిద్ధులు సంప్రాప్తిస్తాయి.