1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
  4. 18 non-Hindu TTD Employees Transferred

టీటీడీ సంచలన నిర్ణయం- 18మంది హిందూయేతర ఉద్యోగులపై బదిలీ వేటు

tirumala temple
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సంచలన నిర్ణయం తీసుకుంది. హిందువులు కాని, ఇతర మతాల ప్రచారంలో పాల్గొన్న దాదాపు 18 మంది టిటిడి ఉద్యోగులను బదిలీ చేశారు. 18 మంది ఉద్యోగులు హిందూయేతర సంప్రదాయాలను అనుసరిస్తున్నారని తేలడంతో టీటీడీ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. 
 
ఈ మేరకు టిటిడి బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు ఆదేశాల మేరకు, నవంబర్ 18, 2024న జరిగిన బోర్డు సమావేశంలో ఆమోదించిన తీర్మానం ఆధారంగా ఈ చర్యను తీసుకోవడం జరిగింది. 
 
హిందూ మతాన్ని అనుసరిస్తామని ఉద్యోగంలో చేరినప్పుడు తీసుకున్న ప్రతిజ్ఞను ఉల్లంఘించడం ద్వారా ఉద్యోగులు టిటిడి పవిత్రతను అపవిత్రం చేశారని పలువురు భక్తులు అభిప్రాయపడ్డారు. టీటీడీ అధికారులు క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. 
 
చర్య ఎదుర్కొంటున్న 18 మంది ఉద్యోగులలో టిటిడి మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, ఎస్వీయూ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్, కొంతమంది లెక్చరర్లు, ఇతరులు ఉన్నారు. ఇదిలా ఉండగా, తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం ఫిబ్రవరి 6 నుండి 12 వరకు తెప్పోత్సవాలు జరుపుకోవడానికి సన్నాహాలు చేస్తోంది.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
సిరుల తల్లి శ్రీలక్ష్మి ఆశీస్సుల కోసం వంటగదిలోని ఈ పదార్థాలను వాడితే?