శుక్రవారం, 27 జూన్ 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 27 జూన్ 2025 (13:19 IST)

Jagannath Rath Yatra: జగన్నాథ రథయాత్రలో అపశృతి.. భక్తుల వైపు దూసుకొచ్చిన ఏనుగు (video)

Elephant
Elephant
గుజరాత్‌లోని గోల్‌వాడ జగన్నాథ రథయాత్రలో అపశృతి చోటుచేసుకుంది. ఊరేగింపులో ఏనుగు ఒక్కసారిగా భక్తులపైకి దూసుకెళ్లింది. భక్తులు భయంతో పరుగులు తీయడం కారణంగా తొక్కిసలాట జరిగింది. పలువురు భక్తులకు గాయాలు అయ్యాయి. వెంటనే వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. 
 
శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమాల్‌పూర్‌లోని జగన్నాథ ఆలయంలో మంగళ హారతి నిర్వహించిన తర్వాత 148వ రథయాత్ర ప్రారంభమైంది. గంటలు, శంఖాలు , ‘జై జగన్నాథ’ మంత్రాల మధ్య రథాలు వాటి స్థానం నుంచి కదిలిన వెంటనే, పూరీ నగర వాతావరణం అద్భుతమైన, దైవిక శక్తితో నిండిపోతుంది. ఈ చారిత్రాత్మక, ఆధ్యాత్మిక ఉత్సవాన్ని వీక్షించడానికి లక్షలాది మంది భక్తులు పూరీకి చేరుకున్నారు. 
 
ఈ రథయాత్ర 9 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ సమయంలో భక్తులు హరే కృష్ణ హరే రామ అని జపిస్తూ రథాలను లాగుతారు. ఈ దైవత్వానికి ఆకర్షితులై విదేశీ భక్తులు కూడా భారీ సంఖ్యలో చేరుతారు. ఈ మహా యాత్ర కోసం మూడు భారీ రథాలను సిద్ధం చేశారు.