శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 22 ఆగస్టు 2019 (14:38 IST)

దుర్గగుడి ఈవోగా సురేశ్‌బాబు బాధ్యతలు

విజయవాడలోని శ్రీ కనకదుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం నూతన కార్యనిర్వాహణాధికారిగా ఎం.వి సురేష్ బాబు బాధ్యతలు స్వీకరించారు. ఈవోగా సురేష్ బాబును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన గురువారం బాధ్యతలు స్వీకరించారు. 
 
ఆయనకు ఆలయ వేదపండితులు మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం దివ్యాశీర్వచనాలు అందజేశారు. అనంతరం మహామండపం ఏడో అంతస్తులో ఉన్న ఈవో కార్యాలయంలో సురేష్ బాబు అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుర్గ గుడి అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. త్వరలో జరగనున్న దసరా ఉత్సవాలను భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దిగ్విజయంగా నిర్వహిస్తామని తెలిపారు. సురేష్‌ బాబు ఇప్పటివరకు అన్నవరం దేవస్థానం ఈవోగా విధులు నిర్వర్తించారు.