శుక్రవారం, 20 సెప్టెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 6 ఆగస్టు 2024 (23:42 IST)

ఒలింపిక్స్‌లో ఫైనల్స్‌కు చేరిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌ వినేష్ ఫోగట్ రికార్డ్

vinesh phogat
వినేష్ ఫోగట్ చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్‌లో ఫైనల్స్‌కు చేరిన తొలి మహిళా రెజ్లర్‌‌గా ఆమె రికార్డు సృష్టించారు. మహిళల 50 కేజీల విభాగం సెమీఫైనల్లో ఆమె 5-0తో క్యూబాకు చెందిన లోపెజ్ గుజ్మాన్‌ను ఓడించింది. తొలి రౌండ్ వరకు వినేష్ 1-0తో ముందంజలో ఉన్నారు. ఒలింపిక్స్‌ క్రీడల్లో ఫైనల్‌ చేరిన తొలి భారతీయ మహిళా అథ్లెట్‌గా వినేష్‌ ఫోగట్‌ నిలిచింది. ఈ ఫీట్‌ను ఇంతకుముందు ఎవరూ చేయలేకపోయారు.
 
గాయం కారణంగా రియో ​​ఒలింపిక్స్ నుంచి వైదొలిగి, ఆపై టోక్యో ఒలింపిక్స్‌లో 16వ రౌండ్‌లో నిష్క్రమించిన వినేష్ ఈ ఏడాది తన ప్రతిభను ప్రపంచానికి చాటారు. తన తొలి మ్యాచ్‌లో, క్వార్టర్స్‌లో వినేష్ 3-2తో నాలుగుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయినటువంటి టోక్యో ఒలింపిక్ స్వర్ణ పతక విజేత సుసాకిని ఓడించింది. ఆపై క్వార్టర్ ఫైనల్స్‌లో 7-5తో ఒక్సానాను ఓడించింది. ఇప్పుడు సెమీ ఫైనల్‌లో 5-0తో ఫైనల్‌కు చేరుకుంది.