శనివారం, 25 ఏప్రియల్ 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 అక్టోబరు 2025 (21:47 IST)

Hyderabad: ఈ-ఆటో పార్కింగ్ పొరపాటు.. ఎనిమిదేళ్ల బాలుడు మృతి.. ఎలా?

road accident
హైదరాబాద్, అశోక్ నగర్‌లోని అమ్మ బాలమ్మ ఆలయం సమీపంలో విద్యుత్ డెలివరీ ఆటో ఈ-ఆటో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో ఎనిమిదేళ్ల బాలుడు మృతి చెందాడు. బాధితుడు, 4వ తరగతి చదువుతున్న పోతరాసు అక్షయ్ కుమార్ తన ఇంటి సమీపంలో ఆడుకుంటూ వున్నాడు. ఆలయం దగ్గర ఒక డెలివరీ వాహనాన్ని డ్రైవర్ పార్క్ చేశాడు. 
 
డ్రైవర్ వాహనాన్ని పార్క్ చేసి, మెయిన్ స్విచ్ ఆఫ్ చేయడం మర్చిపోయాడు. అక్షయ్ తన స్నేహితులతో ఆడుకుంటున్నప్పుడు. వాహనం కదలడం ప్రారంభిస్తుందని తెలియక పుష్ బటన్‌ను నొక్కాడు, ఆపై యాక్సిలరేటర్‌ను నొక్కాడు.
 
కీలెస్ ఇగ్నిషన్ సిస్టమ్ ఉన్న ఆటో, వేగం పుంజుకుని దాదాపు 20 అడుగుల దూరంలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఢీకొన్న అక్షయ్ ముందుకు ఎగిరి, అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటనలో ఆ చిన్నారి తల ముఖానికి తీవ్ర గాయాలైనాయి.
 
ప్రమాదం జరిగిన వెంటనే, అతని స్నేహితుడు అనుప్ అక్షయ్ తండ్రి ఫకీరప్పకు సమాచారం అందించాడు. వెంటనే అపస్మారక స్థితిలో వున్న కుమారుడిని ఫకీరప్ప ఆస్పత్రికి తరలించాడు. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ బాలుడు మరణించాడు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతుంది.