సంబంధిత వార్తలు
- Chiranjeevi: చెన్నైవెళుతున్న చిరంజీవి, వెంకటేష్
- హైదరాబాద్కు తొలి టెస్లా కారు: కొంపల్లికి చెందిన డాక్టర్ కొనేశారు.. ఆయుధ పూజ చేశారు..
- Deepika: దీపికా పదుకొనె, ఆలియా భట్ లు తెలుగు సినిమాల్లో చేయమంటున్నారు..
- ముగిసిన విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నా నిశ్చితార్థం
- Patriot : మమ్ముట్టి, మోహన్లాల్ చిత్రం పేట్రియాట్ హైదరాబాద్లో షెడ్యూల్
Hyderabad: డల్లాస్లో తెలంగాణకు చెందిన విద్యార్థి హత్య.. కాల్చి చంపేశారు
shooting
స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ మంత్రి టి. హరీష్ రావు చంద్రశేఖర్ కుటుంబాన్ని పరామర్శించి తమ సంతాపాన్ని తెలిపారు. మృతదేహాన్ని హైదరాబాద్కు వెంటనే తరలించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అమెరికాలో జరిగిన కాల్పుల ఘటనలో మరణించిన ఎల్బీ నగర్కు చెందిన విద్యార్థి పోల్లె చంద్రశేఖర్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి పట్ల రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి తన సందేశంలో, అమెరికా కాల్పుల్లో చంద్రశేఖర్ మరణం చాలా బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. మృతుల కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నానని తెలిపారు.
చంద్రశేఖర్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా మద్దతు ఇస్తుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఆయన కుటుంబానికి అండగా నిలుస్తుంది. ఆయన భౌతికకాయాన్ని స్వస్థలానికి తీసుకురావడానికి అవసరమైన అన్ని సహాయాలను అందిస్తుందన్నారు.
