1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Kamareddy: 28-year-old man electrocuted while plucking coconuts

ఇనుపరాడ్‌తో కొబ్బరికాయలు కోశాడు... కరెంట్ షాక్... వ్యక్తి మృతి

Kamareddy: 28-year-old man electrocuted while plucking coconuts
కామారెడ్డిలో విద్యుదాఘాతానికి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. జిల్లాలోని పాల్వంచ మండలం ఎల్పుగొండ గ్రామంలో గురువారం సాయంత్రం ఇనుప రాడ్‌తో కొబ్బరికాయలు తీయడానికి ప్రయత్నించిన 28 ఏళ్ల యువకుడు విద్యుదాఘాతానికి గురయ్యాడు. 
 
పౌల్ట్రీ ఫామ్‌లో పనిచేస్తున్న ప్రవీణ్ అనే వ్యక్తి ఇనుప రాడ్‌తో చెట్టు నుండి కొబ్బరికాయలను తీయడానికి ప్రయత్నించాడు. అయితే  ప్రమాదవశాత్తు చెట్టు సమీపంలో ప్రయాణిస్తున్న 11 కెవి వైర్‌కు తాకింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. 
 
స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోస్టుమార్టం నిమిత్తం ప్రవీణ్ మృతదేహాన్ని  ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
రాహుల్ గాంధీ కోసం రూ.10 లక్షలతో బూట్లు?