Kukatpally: గంజాయి గుంపు చేతిలో హత్యకు గురైన యువకుడు.. ఎలా జరిగిందంటే?
హైదరాబాద్లో గంజాయి వాడుతున్న గుంపు వెంకటరమణ అనే యువకుడిని హత్య చేసింది. కూకట్పల్లిలోని సర్దార్ పటేల్ నగర్లోని ఒక అపార్ట్మెంట్ సమీపంలోని పార్కులో ఐదుగురు యువకులు కూర్చుని గంజాయి తీసుకుంటుండగా, వెంకటరమణ, అతని స్నేహితులు, అపార్ట్మెంట్ వాచ్మెన్ వారిని ఆపమని అడిగారు.
ముఠా సభ్యుల్లో ఒకరైన పవన్ కోపంగా వెంకటరమణ ఛాతీపై ఇనుప రాడ్తో పొడిచాడు. ఈ దాడిలో వెంకటరమణ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు ఈ గొడవను చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుల్లో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
ఈ ఘటనలో ప్రధాన నిందితుడు పవన్ పరారీలో వున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. హత్యకు డ్రగ్స్ కారణమా లేదా ఏదైనా వ్యక్తిగత సమస్య కారణాలున్నాయా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.