1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. 3 Maoists killed in Odisha's Bijapur encounter

చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్ - ముగ్గురి మృతి

Malkangiri encounter
తెలంగాణ - చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మావోయిస్టులు, పోలీసుల మ‌ధ్య జరిగిన కాల్పుల్లో ఈ ప్రాణ నష్టం సంభవించింది. ఈ ఘ‌ట‌న ములుగు-బీజాపూర్ అట‌వీప్రాంతంలో చోటు చేసుకుంది.
 
ఈ ఎదురు కాల్పుల‌లో ఇప్ప‌టివ‌ర‌కు ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఎస్‌ఎల్‌ఆర్‌, ఎకె47 రైఫిల్‌లు ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నారు. బీజాపూర్‌లోని తర్లగూడ తెలంగాణ సరిహద్దులో ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతునే ఉన్నాయి.
తర్వాతి కథనం
సొంత నియోజకవర్గంలో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోడీ