1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 18 జనవరి 2022 (12:38 IST)

తెలంగాణలోని అన్నీ పాఠశాలల్లో ఇక ఇంగ్లీష్ మీడియం

తెలంగాణలోని అన్నీ పాఠశాలల్లో ఇకపై ఇంగ్లీష్ మీడియం వుండనుంది. దీంతో అన్నీ స్కూల్స్‌లో ఇంగ్లీష్ మీడియం బోధించనున్నారు. 2022-23 నుంచే ఈ విధానం అమలులోకి రానుంది. 
 
సోమవారం అధికారికంగా సీఎం కేసీఆర్ నివాసంలో భేటీ తర్వాత ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఇదే మీటింగ్‌లో మన ఊరు మన బడి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. రూ.7వేల 289కోట్లు వెచ్చించి గవర్నమెంట్ స్కూల్స్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఫెసిలిటీలను ఏర్పాటు చేయనున్నారు.
 
ఈ మేరకు విద్యాశాఖ మంత్రి అధ్యక్షతన సబ్ కమిటీకి ఆమోదం తెలిపింది కేబినెట్. అంతేకాకుండా ప్రైవేట్ స్కూల్స్, జూనియర్, డిగ్రీ కాలేజీలలో ఫీజును సైతం రెగ్యూలేట్ చేయనున్నారు.