బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వి
Last Updated : శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (12:35 IST)

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, వర్షాలు ఇప్పట్లో తగ్గబోవు- వాతావరణశాఖ

తెలుగు రాష్ట్రాలలో భారీగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 20వ తేదీన ఆదివారం నాడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నదని, ఇప్పటికే కురుస్తున్న వర్షాలకు తోడు, కొత్త అల్పపీడనం కారణంగా ఏర్పడే పరిస్థితులు కలిసి, మరిన్ని రోజుల పాటు వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలియజేసింది.
 
ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడినా, ఉపరితల ఆవర్తనం ప్రభావం కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాదులో నిత్యమూ ఏదో ఒక సమయంలో భారీ వర్షం కాసేపు పలకరిస్తూనే ఉంది.
 
ఇక రాగల 48 గంటల్లో ఉమ్మడి అదిలాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లా నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లా ఒకటి రెండుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలకు అవకాశం ఉందని హైదరాబాదు వాతావరణశాఖ హెచ్చరించింది.