హైదరాబాద్ మెట్రో ప్రయాణీకులకు షాక్.. ఏంటది?  
                                       
                  
                  				  హైదరాబాద్ మెట్రో ప్రయాణీకులకు షాకిచ్చింది. ఇప్పటికే మెట్రో ప్రయాణ ఛార్జీల్లో ఎల్ అండ్ టీ సంస్థ కోత విధించింది. తాజాగా మెట్రో స్టేషన్లలో టాయిలెట్స్కు కూడా ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది. 
				  											
																													
									  
	 
	ఇప్పటివరకు స్టేషన్లలో వుండే పబ్లిక్ టాయిలెట్స్కు ఎలాంటి ఛార్జీలు లేవు. కానీ ఇకపై వాటికి కూడా ఛార్జీలు వసూలు చేయాలని ఎల అండ్ టీ నిర్ణయించింది. 
				  
	 
	రానున్న రోజుల్లో హైదరాబాద్లోని అన్నీ మెట్రో స్టేషన్లలోని టాయిలెట్స్ను అందుబాటులోకి తీసుకొచ్చి... వాటిని ఉపయోగించుకునే ప్రయాణీకుల వద్ద ఛార్జీలు వసూలు చేస్తారు.