1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. egg and stone plotted on Bandi Sanjay Car Convoy

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ కాన్వాయ్‌పై కోడిగుడ్ల దాడి

Egg
తెలంగాణ రాష్ట్ర బండి సంజయ్ కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు గుడ్లు, రాళ్ళతో దాడికిపాల్పడ్డారు. నార్కెట్‌పల్లి అద్దంకి హైవేపై ఈ ఘటన జరిగింది. మిర్యాలగూడ వెళ్తుండగా ఈ దాడి జరిగింది. 
 
నల్గొండ మండలం ఆర్జలబావి ఐకేపీ సెంటర్ వద్ద రైతులతో ముఖాముఖీ ముగించుకుని మిర్యాలగూడ వెళ్తున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కాన్వాయ్‌పై గుడ్లతో, రాళ్లతో గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. 
 
అయితే, ఈ దాడికి పాల్పడింది టీఆర్ఎస్ శ్రేణులంటూ బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కాన్వాయ్ పై దాడికి నిరసనగా నార్కెట్‌పల్లి అద్దంకి జాతీయ రహదారిపై బైఠాయించిన బీజేపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు.
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
ఢిల్లీలో సంపూర్ణ లాక్ డౌన్‌ రంగం సిద్ధం.. సుప్రీంలో విచారణ