1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 11 మే 2021 (11:08 IST)

మరికొన్ని గంటల్లో నేను చనిపోతానానుకుంటా, ప్లీజ్ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లు: భార్యకి ఫోన్

కరోనా విధ్వంసం తీవ్రంగా వుంటోంది. పలు చోట్ల ఆక్సిజన్ అందక కరోనా రోగుల ప్రాణాలు పోతున్నాయి. ఇంకొన్ని చోట్ల రోగుల ఆరోగ్య పరిస్థితి క్షీణించి వున్నవారు వున్నట్లే ఒరిగిపోతున్నారు. హైదరాబాద్ ఓయు ఉద్యమ నేత కృష్ణగౌడ్ కరోనాతో మృతి చెందారు. ఆయన చనిపోయే ముందు తన భార్యతో మాట్లాడిన మాటలు గుండెలను పిండేస్తున్నాయి.
 
ఆయన భార్య చెప్పిన వివరాల ప్రకారం... నన్నెవరూ పట్టించుకోవడంలేదు. ఆక్సీజన్ పైపు పెట్టలేదు. నేను ప్రస్తుతానికి బ్రతికే వున్నా. ఇలాగే కొన్ని గంటలు వుంటే చనిపోవచ్చు. నన్ను త్వరగా ఏదైనా ప్రైవేటు ఆసుపత్రికి తీసుకుని వెళ్లు" అంటూ సూర్యాపేటకు చెందిన మునగాల మండలం నేలమర్రి గ్రామానికి చెందిన కృష్ణగౌడ్ భార్యతో చెప్పిన చివరి మాటలు. 
 
ఆదివారం రాత్రి ఆయన తన భార్యతో ఈ మాటలు చెప్పారు. సోమవారం ఉదయం కన్నుమూశారు. ఈ ఘటనపై నిమ్స్ ఆసుపత్రి వర్గాలు వివరిస్తూ... తాము వెంటిలేటర్ పైన వుంచి చికిత్స చేశామనీ, అతడిని కాపాడాలని శాయశక్తులా ప్రయత్నించామన్నారు. కానీ పరిస్థితి విషమించి కన్నుమూశాడంటూ చెప్పారు.