1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

అంబులెన్స్‌లో సజీవదహనమైన 15 గోవులు

cows burning
నిజామాబాద్ జిల్లా జాతీయ రహదారిలో ఒక అంబులెన్స్ ఎమర్జెన్సీ అని స్టిక్కర్ అని అతికించుకున్న వాహనంలో మంటలు చెలరేగి, అందులో ఉన్న 15 ఆవులు సజీవదహనమయ్యాయి. ఈ దారుణం జిల్లాలోని ఇందల్వాయి పరిధిలోని మాక్లూర్ తండా శివారు జాతీయ రహదారిపై జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఒక వాహనానికి అంబులెన్స్‌ అంటూ స్టిక్కర్‌ అంటించుకున్నారు. ఈ వాహనం ఇంజిన్‌లోని మంటలు చెలరేగాయి. దీన్ని గమనించిన డ్రైవర్‌ వాహనాన్ని రోడ్డు పక్కన ఆపేసి పరారయ్యాడు. వెనుక వస్తున్న వాహనదారులు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. 
 
ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వాహనం డోర్‌ను తీసేందుకు ప్రయత్నించగా తెరుచుకోలేదు. దీంతో అందులో ఉన్న 15 ఆవులు మంటల్లో కాలిపోయాయి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.