మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : బుధవారం, 31 అక్టోబరు 2018 (16:54 IST)

భర్తకు దూరమైన మేనకోడలితో తొడపరిచయం... కోరిక తీరాక ఘాతుకం...

మనస్పర్థల కారణంగా భర్తకు దూరమై ఒంటరిగా జీవిస్తున్న మేనకోడలికి మేనమామ మాయమాటలు చెప్పి తొడ సంబంధం పెట్టుకున్నాడు. అలా కొంతకాలం గుట్టుచప్పుడు కొనసాగుతూ వచ్చిన ఈ అక్రమ సంబంధం చివరకు కట్టుకున్న భార్యకు తెలిసింది. దీంతో ఇంట్లో భార్య పోరు ఎక్కువైపోయింది. దీనికంతటికి కారణం మేనకోడలేనని భావించి... ఆమెను హత్య చేయడానికి పూనుకున్నాడు. అయితే, అదృష్టవశాత్తు ఆమె ప్రాణాలతో బయటపడగా ఆ కామాంధుడు మాత్రం కటకటాలపాలయ్యాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సంగారెడ్డి జిల్లా నెల్‌కల్‌ మండలం, అగ్నూర్‌ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి లింగంపల్లిలోని తారానగర్‌లో భార్యా పిల్లలతో నివశిస్తున్నాడు. సంగారెడ్డికి చెందిన ఓ మహిళ భర్తతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా తన పిల్లలతో కలిసి ఒంటరిగా జీవిస్తోంది. ఈమె వరుసకు మేనకోడలు. 
 
ఆమెకు అండగా ఉన్నట్టుగా నటించి ఆమెను లోబరుచుకుని తొడసంబంధం పెట్టుకన్నాడు. ఈ విషయం కట్టుకున్న భార్యకు తెలిసింది. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆమెకు బంగారం కొనిపెట్టి డబ్బులు ఇస్తున్నాడని, తనను పిల్లలను పట్టించుకోవడంతో లేదని భార్య ఘర్షణకు దిగింది. 
 
ఈ నేపథ్యంలో ఆ మహిళ అక్కడి నుంచి వెళ్లిపోయి చందానగర్‌లో ఓ ప్రైవేట్‌ హాస్టల్‌లో ఉంటూ స్టోర్‌ కీపర్‌గా పనిచేస్తోంది. ఏడాది నుంచి అతడితో ఆమెకు ఎలాంటి సంబంధం లేకుండా ఒంటరిగా ఉంటోంది. తన కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు, గొడవలకు కారణం ఆ మహిళ అని కక్షగట్టిన ఆ వ్యక్తి.. మద్యం తాగి హత్య చేయటానికి కొడవలి తీసుకొని హాస్టల్‌కు వెళ్లి దాడికి యత్నించాడు. స్థానికులు అడ్డుకోవడంతో ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఆమె వెంటపడుతున్న మేనమామను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.