1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Mansoon to enter India within 24 hours,

తీపి కబురు చెప్పిన వాతావరణ శాఖ

rain
దేశం వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. పలు రాష్ట్రాల్లో పగటి పూట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఒకవైపు ఎండలు, మరోవైపు ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో భారత వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. 
 
వచ్చే 24 గంటల్లో భారత్‌లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వెల్లడించింది. అండమాన్ నికోబార్ దీవులకు రుతుపవనాలు వస్తాయని తెలిపింది. ఆ తర్వాత బంగాళాఖాతం, హిందూ మహా సముద్రంలో రుతపవాలు విస్తరిస్తాయని వెల్లడించింది. 
 
ఆ తర్వాత ఈ నెలాఖరులోగా కేరళను తాకుతాయని చెప్పింది. జూన్ 8వ తేదీ లోగా తెలంగాణా రాష్ట్రంలోకి ఈ రుతుపవనాలు ప్రవేశిస్తాయని తెలిపింది. ఇదిలావుంటే, ఆదివారం రాత్రి తెలంగాణా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
దేశంలో అదుపులో ఉన్న కరోనా వైరస్