1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 31 డిశెంబరు 2022 (12:12 IST)

భార్య వివాహేతర సంబంధం.. ఆర్మీ జవాన్ మనస్తాపంతో ఆత్మహత్య

crime scene
భార్య వివాహేతర సంబంధాల కారణంగా ఆర్మీ జవాన్ మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మంచిర్యాలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భగత్ నగర్‌కు చెందిన మార్త అశోక్ - పుష్ప దంపతుల కుమారుడు శ్రావణ్ కుమార్ (32)కు హాజీపూర్ మండలం ర్యాలీగడ్ పూర్‌కు చెందిన బొద్దు రజితతో 2021 జూన్ 24న వివాహమైంది. ఆర్మీలో ఉద్యోగం చేస్తున్న శ్రావణ్ కుమార్ ఉద్యోగ రీత్యా ఇటీవల అమృతసర్ వెళ్లాడు.
 
ఈక్రమంలో ర్యాలిగడ్‌పూర్‌కు చెందిన బొప్ప రాకేష్‌తో రజిత వివాహేతర సంబంధం పెట్టుకుంది. రజితను హెచ్చరించినా ఎలాంటి మార్పు లేదు. దీనికి తోడు ప్రియుడితో కలిసి వేధింపులకు రజిత గురిచేసింది. 
 
దీంతో మనస్తాపానికి గురైన శ్రావణ్‌కుమార్‌.. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకున్నాడు. అతని మృతికి భార్య రజిత, భాగ్య, రాకేష్‌ కారణమని మృతుని తల్లి పుష్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదైంది.