గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జె
Last Modified: సోమవారం, 11 మే 2020 (22:54 IST)

మొగుడు కువైట్‌లో, భార్య ముగ్గురితో ఎంజాయ్, ఆ తర్వాత?

డబ్బుకు ఆశపడింది. భర్త అనారోగ్యంతో చనిపోతే 70 యేళ్ళ వృద్ధుడిని రెండో పెళ్ళి చేసుకుంది. కువైట్‌కు చెందిన అతను హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ఉండేవాడు. హైదరాబాద్‌లో బంగారం వ్యాపారం చేసేవాడు. ఉండేది కువైట్లో అయినా వ్యాపారం అన్ని ప్రాంతాల్లో విస్తరింపచేశాడు.
 
తన వ్యాపారంతో పాటు మంచి రసికుడు కూడా. వ్యాపారానికి వెళ్ళినప్పుడు అక్కడున్న మహిళలకు మాయమాటలకు చెప్పి డబ్బులు వెదజల్లి వారిని లోబరుచుకునేవాడు. అలానే జూబ్లీహిల్స్‌లో ఒక మహిళ అతనికి బాగా దగ్గరైంది. నెలన్నర మాత్రమే హైదరాబాదులో ఉంటే ఆమెతోనే ఉన్నాడు. ఆమెను పెళ్ళి కూడా చేసుకున్నాడు.
 
ఈ మధ్యే అతను కువైట్‌కు వెళ్ళాడు. మొగుడు అలా కువైట్‌కు వెళ్ళిందే ఆమె ఒక యువకుడితో పరిచయం పెట్టుకుంది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. అలా మరో ఇద్దరితోను రాసలీలల్లో మునిగితేలింది. అనారోగ్యంగా ఉందని.. డబ్బులు కావాలంటూ కువైట్లో తన భర్తకు తరచూ ఫోన్ చేసి అకౌంట్లో డబ్బులు వేసుకునేది.
 
ఎందుకో అనుమానం వచ్చిన అతను వారంరోజుల క్రితం తన స్నేహితుడి సహాయంతో విషయాన్ని తెలుసుకున్నాడు. ఆమె ముగ్గురితో రాసలీలల్లో ఉందన్న విషయం బయటపడింది. దీంతో అతను స్నేహితుడి సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే తనపై ఫిర్యాదు చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న సదరు మహిళ ఆ వృద్ధుడిపైనే లైంగిక వేధింపుల కేసు పెట్టింది.
 
అతనితో ఏకాంతంగా ఉన్నప్పటి వీడియోలు, ఫోటోలను మహిళా పోలీసులకు చూపించి కేసు పెట్టింది. ఈ కేసుపై విచారణ జరిపిన పోలీసులు కిలాడీ మహిళగా గుర్తించారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.