సంబంధిత వార్తలు
- క్వాడ్ సదస్సు : అమెరికా వెళ్లనున్న ప్రధాని మోడీ
- హీరోలకు యాక్సిడెంట్ అయితే స్పందించే కేటీఆర్...
- ప్రత్యేక హోదాపై కేంద్రానికి ఏనాడైనా ఒక్క లేఖ రాశారా వీర్రాజు గారూ..?: మంత్రి సీదిరి అప్పలరాజు
- మంత్రి హరీష్ రావు ఓ రబ్బర్ స్టాంప్: ఈటల ఫైర్
- టిడిపికి అధోగతే, పార్టీని ఎవరూ నమ్మలేదు: మరోసారి జేసీ సంచలన వ్యాఖ్యలు
ఆరేళ్ల చిన్నారి హత్యాచారం ఘటన.. నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలి..?
mallareddy
తెలంగాణలో సంచలనం రేపుతున్న ఆరేళ్ల చిన్నారి హత్యాచారం ఘటనపై మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ... చిన్నారి పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరించిన నిందితుడిని ఎన్ కౌంటర్ చేయాలని వ్యాఖ్యానించారు. నిందితుడిని పట్టుకుని కచ్చితంగా ఎన్ కౌంటర్ చేస్తామని తెలిపారు. త్వరలోనే బాధితురాలి కుటుంబాన్ని పరామర్శిస్తామన్నారు.
సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటనలో నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు పది బృందాలను ఏర్పాటు చేశారు. అయినప్పటికీ నిందితుడి ఆచూకీ ఇంతవరకు దొరకలేదు.
కాగా, గతంలో దిశ హత్యాచారం ఘటనలో నిందితులను ఎన్కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఘటనలోనూ నిందితుడిని ఎన్ కౌంటర్ చేస్తామంటూ మంత్రి మల్లారెడ్డి స్టేట్మెమెంట్ ఇవ్వడం చర్చనీయంశమైంది.