1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Nirmala Sitharaman: Telangana is in debt due to KCR corruption

తెలంగాణ రెవెన్యూ లోటు రాష్ట్రంగా మారింది.. కేసీఆరే కారణం..?

nirmala sitharaman
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) ప్రభుత్వంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మండిపడ్డారు. 2014లో రెవెన్యూ మిగులు రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ ఇప్పుడు రెవెన్యూ లోటు రాష్ట్రంగా మారిందని, దీనికి ముఖ్యమంత్రి కేసీఆరే కారణమని నిర్మలా సీతారామన్ ఆరోపించారు. మల్కాజిగిరి భాజపా అభ్యర్థి ఎన్‌.రాంచంద్రరావు కోసం ఏర్పాటు చేసిన మీట్‌ అండ్‌ గ్రీట్‌ సభలో ఆమె ప్రసంగిస్తూ.. మరో రెండు, మూడు తరాల్లో తెలంగాణ అప్పులు తీరుతాయని అన్నారు.
 
మద్యం, పెట్రోలు, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని, వాటిని జీఎస్టీ పరిధిలోకి తెస్తేనే ధరలు సహేతుకంగా ఉంటాయని ఆర్థిక మంత్రి అభిప్రాయపడ్డారు. "రాష్ట్రానికి ఎలాగూ పెట్టుబడులు వస్తున్నాయి. రెవెన్యూ మిగులు రాష్ట్రం (2014లో) ఇప్పుడు రెవెన్యూ లోటు రాష్ట్రంగా రూపాంతరం చెందింది. ఆ గౌరవం కేసీఆర్‌కే దక్కుతుంది. నేడు తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. మరో రెండు మూడు తరాల తర్వాత మా పిల్లలు ఆ అప్పులు తీర్చుకోవాల్సి వస్తుంది" అని నిర్మలా సీతారామన్ తెలిపారు. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
సీఎం జగన్‌ బెయిల్‌ను రద్దు చేయండి.. సుప్రీంలో పిటిషన్ - శుక్రవారం విచారణ