ప్రపంచాన్ని మహమ్మారి కరోనా వైరస్ కబళించింది. ఈ వైరస్ బారినుంచి ప్రజలను కాపాడుకునేందుకు ఆయా దేశాల ప్రభుత్వాలు ఎన్నో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. కానీ, ప్రజలు మాత్రం తమకేం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా, ఆదివారం వచ్చిందంటేచాలు మాంసాహార ప్రియులు మటన్, చికెన్ దుకాణాలకు పోటెత్తుతున్నారు. మటన్, చికెన్ షాపుల మందు జనం కిటకిటలాడుతున్నారు. ఈ కారణంగా ప్రభుత్వం లక్ష్యం నీరుగారిపోతోంది. కరోనా వైరస్ విజృంభిస్తుందని ప్రభుత్వం ఎంత...