సంబంధిత వార్తలు
- ఇస్రోలో ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
- భర్తకు బ్రేకప్ చెప్పనున్న బ్యూటీ కీర్తి
- నెలవారీ రీచార్జ్లొద్దు.. ఏడాది ప్లాన్కు మారిపోతే.. జియో కొత్త ప్లాన్స్ గురించి తెలుసా?
- ట్విట్టర్ ట్రెండింగ్లో #RRR.. సూర్యుడు మంట మీదున్నాడు.. జాగ్రత్త!!
- చెన్నై చేరుకున్న విరాట్ కోహ్లి: 7 రోజులు క్వారెంటైన్, ఎందుకని?
ఎలుకల కోసం పెట్టిన మందు.. కర్భూజ తినడంతో ఇద్దరు చిన్నారులు..?
ఎలుకల కోసం పెట్టిన మందు రెండు నిండు ప్రాణాలను బలిగొంది. పెద్దపల్లి జిల్లాలో ఈ విషాదం నెలకొంది. అంతర్గాం మండలంలోని విస్సంపేట గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలోని ఐదుగురు వ్యక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విషాహారం తిన్న వీరిలో ఇద్దరు మృతి చెందగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. దారబోయిన శ్రీశైలం-గుణావతి దంపతులు ఇంట్లో ఎలుకల కోసం మందు పెట్టగా ఎలుకలు మందుతోపాటు కర్భూజను కూడా తిన్నాయి.
ఆ కర్భూజను కుటుంబంలోని ఐదుగురు తిన్నారు. దీంతో అస్వస్థతకు కుటుంబ సభ్యులు గురికాగా కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు కుమారులు దారబోయిన శివానంద్(10), శరణ్ మృతి చెందారు. తల్లిదండ్రుల పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. వృద్ధురాలి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.