సంబంధిత వార్తలు
- కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె... నేటికి 33వ రోజు
- కేసీఆర్ డెడ్లైన్కు భయపడొద్దు... జేజెమ్మ వచ్చినా ఆర్టీసీని క్లోజ్ చేయలేరు
- దోచుకోవడానికేనా ప్రైవేట్ పర్మిట్లు : అశ్వత్థామరెడ్డి ప్రశ్న
- అమిత్ షా వద్దకు ఆర్టీసీ పంచాయతీ : కేసీఆర్కు చిక్కులు తప్పవా?
- వీధి రౌడీల్లా ప్రవర్తించిన పోలీసులు - లాయర్లు : రణరంగాన్ని తలపించిన తీస్హాజారీ కోర్టు
ఆర్టీసీ సమ్మె.. అందినంత దోచేయ్ గురూ...
ప్రైవేటు ఉద్యోగుల చేతి వాటం. ఆర్టీసీ సమ్మె మూలంగా ప్రజలు ఇబ్బంది పడుతున్న సంగతి పక్కన పెడితే.. ఆర్టీసీలో విధులు నిర్వహిస్తున్న ప్రైవేటు ఉద్యోగులు మాత్రం ఇదే అదునుగా తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఈ అవకతవకలను మాత్రం ఉన్నతాధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు.
కేవలం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం డిపోలో దాదాపు రోజువారీగా 10 నుండి 20 వేల మధ్యల అధికారులు పంచుకున్నట్లు ఆరోపణలు వినపడుతున్నాయి. మంగళవారం రాత్రి తాత్కాలిక అకౌంటెంట్ తప్పుగా తక్కువగా లెక్కలు రాసి బస్ డిపో నుండి డబ్బులు తీసుకు పోయే ప్రయత్నంలో సెక్రటరీ అధికారులు పట్టుకొని పోలీస్ స్టేషన్ కు అప్పగించారు.
