1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జె
Last Modified: గురువారం, 25 మార్చి 2021 (15:47 IST)

మేనల్లుడిని నమ్మి ఇంటికి తీసుకువస్తే, అత్తను లైన్లో పెట్టాడు, ఆ తరువాత

తన సొంత అక్క ఆర్థిక పరిస్థితి బాగాలేదని ఆమె కొడుకుని తన ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నాడో మామ. అయితే మామ చెప్పినట్టు వినాల్సిన ఆ అల్లుడు ఏకంగా అత్తనే లైన్లో పెట్టాడు. ఆమెతో సరస సల్లాపాల్లో మునిగితేలుతూ చివరకు మామకే అడ్డంగా దొరికిపోయాడు. ఇదేంటని ప్రశ్నించినందుకు అతి దారుణంగా మామను అత్తతో కలిసి చంపేశాడు.
 
జోగులాంబ గద్వాల జిల్లా ధరూరు మండలం మార్లబీడు గ్రామానికి చెందిన బంట్రోతు రంగారెడ్డి అనే వ్యక్తికి 32 యేళ్ల క్రితం వివాహమైంది. అనారోగ్యంతో సంవత్సరం క్రితమే మొదటి భార్య చనిపోయింది. దీంతో రెండవ వివాహం చేసుకున్నాడు.
 
రెండు నెలల క్రితం అక్క రాజేశ్వరి ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడం.. బావ చనిపోవడంతో ఆమె కొడుకు సుదర్సన్ రెడ్డిని తన ఇంటికి తీసుకొచ్చాడు. తన ఇంట్లోనే ఉంచి పనికి తీసుకెళ్ళేవాడు. రంగారెడ్డి మేస్త్రీ. సుదర్సన్‌ను కూలీగా తీసుకెళ్ళేవాడు.
 
అయితే గత 15 రోజుల నుంచి సుదర్సన్ అత్తను లైన్లో పెట్టాడు. ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. వారం క్రితమే ఈ విషయం రంగారెడ్డికి తెలిసింది. అల్లుడితో పాటు రెండవభార్యను మందలించాడు. అయితే భర్త చెప్పినట్లు వినాల్సిన భార్య ఏకంగా ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది.
 
నిద్రిస్తున్న రంగారెడ్డిని అతి దారుణంగా ఇద్దరూ కలిసి చంపేశారు. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే బంధువులకు అనుమానంతో కేసు పెట్టడంతో విచారణ జరిపి దారుణ హత్య అని నిర్ధారించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.