సంబంధిత వార్తలు
- ఇకపై గర్భనిరోధక మాత్రలు అక్కర్లేదు.. తెలుగు రాష్ట్రాల్లో ప్రయోగం...
- ఆర్టీసీ కార్గో సిబ్బంది చేతివాటం : 51 కేజీల జామకాయలకు గాను... 21 కేజీలే చేరాయి..
- టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో స్టేటస్ రిపోర్టు ఇవ్వండి... తెలంగాణ హైకోర్టు
- ప్రశ్నపత్రం లీకేజీకి పాల్పడితే పదేళ్ల జైలు.. ఎక్కడ?
- ప్రభుత్వ జూనియర్ కళాశాల ఫస్ట్ లుక్ అండ్ గ్లింప్స్ రిలీజ్
పరీక్ష రాస్తుండగా విద్యార్థిని గుండెపోటు.. సీపీఆర్ ప్రాణాలు నిలబెట్టిన సిబ్బంది
తెలంగాణ రాష్ట్రంలో ఒక విద్యార్థిని పరీక్ష రాస్తుండగా గుండెపోటుకు గురైంది. దీంతో సిబ్బంది ఆ బాలికకు సీపీఆర్ నిర్వహించి ఆ విద్యార్థి ప్రాణాలు కాపాడారు. పాలమూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి.
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వం జూనియర్ కాలేజీలో ఈ పరీక్ష రాస్తున్న సమయంలో బిందు అనే ఇంటర్ విద్యార్థిని తీవ్ర అస్వస్థతకు లోనైంది. దీంతో పరీక్ష కేంద్రంలోని పీఆర్డీవో వెంకటేశ్వర్లు వెంటనే 108కు ఫోన్ చేశారు. క్షణాల్లో పరీక్ష కేంద్రానికి చేరుకున్న 108 సిబ్బంది ఆ విద్యార్థినికి సీపీఆర్ పరీక్ష చేసి ప్రాణాలను కాపాడారు. ప్రస్తుతం విద్యార్థిని ఆరోగ్యం నిలకలడగా ఉంది.
కాగా, ఇటీవలి కాలంలో అనేక మంది టీనేజీ యువతీయువకులు గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. అప్పటిదాగా అల్లాసంగా ఉన్న వాళ్లు కూడా ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. ఆస్పత్రులకు వెళ్లేలేపు వారు ప్రాణాలు కోల్పోతున్నారు.