ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన ఓ తెలుగు విద్యార్థి గుండెపోటుకు గురై మృత్యువాతపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న మృతుని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. మృతుడిని మెదక్ జిల్లా మనోహరాబాద్ ప్రాంతానికి చెందిన వినీత్గా గుర్తించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ నెల 18న న్యూయార్క్ కాలమానం ప్రకారం ఉదయం 7 గంటల సమయంలో నడుచుకుంటూ వెళ్తూ వినీత్ అకస్మాత్తుగా గుండెపోటుకు...