శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 28 ఫిబ్రవరి 2020 (11:48 IST)

ఆరిన కంటిదీపాలు, ఇంట్లోని వంటింటి గోడ కూలి ముగ్గురు చిన్నారులు మృతి

ఆ ఇంటి కంటి దీపాలు ఆరిపోయాయి. హైదరాబాద్ మాంగార్ బస్తీలో నివాసముండే చిత్తు కాగితాలు ఏరుకుని జీవించే మీఠాలాల్, గబ్బర్‌లనే అన్నదమ్ములు తమ కుటుంబాలతో ఒకే ఇంట్లో నివాసముంటున్నారు. రాత్రి అన్నం తిన్నాక పిల్లలు ఇంట్లో నిద్రిస్తుండగా.. పెద్దలు ఇంటి ముందు కూర్చొని ఉన్నారు. వంటింటి గోడ ఫెళ్లుమంటూ ఒక్కసారిగా కుప్పకూలింది. 
 
ఈ ప్రమాదంలో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న మీఠాలాల్ ముగ్గురు కుమార్తెలు ఆరేళ్ల రోష్ని, మూడేళ్ల సారిక, రెండు నెలల వయస్సున్న పావని అక్కడికక్కడే చనిపోగా.. గబ్బర్ కుమార్ మూడేళ్ల గీత తీవ్ర గాయాలపాలైంది. గోడ కింద శిథిలాల్లో చిక్కుకున్న ముగ్గురు చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ మూడేళ్ల గీతకు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.