1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. TSRTC Hike Ticket Reservation Charges in Telangana

టీఎస్ఆర్టీసీ దొంగదెబ్బ : రిజర్వేషన్ చార్జీల పెంపు

tsrtc
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరోమారు దొంగదెబ్బ కొట్టింది. ప్రయాణికులపై అదనపు భారం మోపింది. ఇప్పటికే రెండుసార్లు బస్సు చార్జీలు పెంచిన ఆర్టీసీ.. ఇపుడు మరో పిడుగు వేసింది. గుట్టుచప్పుడు కాకుండా రిజర్వేషన్ చార్జీలను పెంచేసింది. అయితే, ఈ పెంపు భారంపై ఆర్టీసి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. 
 
ఒక్కో ప్రయాణ టిక్కెట్ రిజర్వేషన్ చార్జీపై రూ.20 నుంచి రూ.30 వరకు పెంచేసింది. ఈ పెంచిన చార్జీలు కూడా తక్షణం అమల్లోకి రానున్నాయి. దీంతో టిక్కెట్ చార్జీలు మరింతగా పెరగనున్నాయి. దీనిపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఈ బాదుడు చాలదన్నట్టుగా మరోమారు ఆర్టీసీ చార్జీలు పెరుగుతాయని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రకటించడంపై ప్రయాణికులు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నదూరాలకు కూడా టిక్కెట్ చార్జీలను పెంచడంతో ప్రయాణికులు గగ్గోలుపెడుతున్నారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
అంతు చిక్కని వ్యాధితో చిన్నారుల మృతి-మూర్చ, జ్వరంతో..?