సంబంధిత వార్తలు
- ఔను... అత్యాచారం చేశాను... : మాజీ సీఐ నాగేశ్వర రావు
- 2022 జూన్లో హైదరాబాద్లో రిజిష్టరైన 5,408 అపార్ట్మెంట్లు: నైట్ ఫ్రాంక్ ఇండియా
- శభాష్ మిథు అంటూ తాప్సీని అభినందించిన మిథాలీ రాజ్
- మార్షల్ ఆర్ట్స్లో ఎంతో సాధించాను ఇకపై సినిమానే కెరీర్ - పూజా భాలేకర్
- పక్షవాతం బారినపడిన తండ్రిని కొట్టి చంపేసిన తనయుడు
హైదరాబాద్ మెట్రోపిల్లర్ ఢీకొని ఇద్దరు మృతి
హైదరాబాద్లోని సోమాజీగూడలో మెట్రోపిల్లర్ ఢీకొని ఇద్దరు మృతి చెందారు. బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు మెట్రో పిల్లర్ను ఢీకొని ప్రాణాలు కోల్పోయారు.
వివరాల్లోకి వెళితే.. కర్ణాటకకు చెందిన ఇద్దరు యువకులు మోహిన్ (23), ఒబేద్ (22) బైక్పై ఖైరతాబాద్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో సోమాజీగూడ హనుమాన్ దేవాలయం ఎదురుగా ఉన్న మెట్రోపిల్లర్ను ఢీకొట్టారు.
ఈ ఘటనలో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. యువకులిద్దరూ నగరంలోని వారి బంధువుల ఇంటికి వచ్చినట్టు పోలీసులు తెలిపారు.
అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.