శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 18 జనవరి 2023 (15:02 IST)

క్లాస్‌మేట్‌పై దాడి.. బండి సంజయ్‌ కుమారుడిపై కేసు నమోదు

bandi sanjay
మహీంద్రా యూనివర్శిటీలో క్లాస్‌మేట్‌పై దాడి చేసిన ఆరోపణలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కుమారుడు భగీరథ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
భగీరథ విద్యార్థిపై మాటలతో, శారీరకంగా దాడి చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ వీడియో ప్రసారం కావడంతో, యూనివర్సిటీ అధికారులు మంగళవారం ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
కొన్ని రోజుల క్రితం స్నేహితుడి సోదరితో సంబంధాన్ని ఆరోపిస్తూ గొడవ జరిగినట్లు సమాచారం. బాధితుడు శ్రీరామ్ ఒక వీడియోను విడుదల చేశాడు. అందులో అతను అమ్మాయిని ఇబ్బంది పెట్టినట్లు అంగీకరించాడు.
 
ఇది భగీరథ్‌కు కోపం తెప్పించింది, అయితే శ్రీరామ్ తనకు ఇకపై భగీరథ్‌తో ఎటువంటి సమస్య లేదని తెలిపాడు.  సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.