బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 11 సెప్టెంబరు 2022 (14:20 IST)

వరద నీటిలో కొట్టుకుని పోయిన కారు... ఇద్దరు మృతి

crime scene
తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లా వ్యాప్తంగా శనివారం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో షాజుల్ నగర్‌లో ఎల్లమ్మగుడి కాలువ పొంగి పోర్లుతుంది. ఈ క్రమంలో జగిత్యాల నుంచి హైదరాబాద్ వెళుతున్న ఓ కారు ప్రమాదవశాత్తు వేములవాడ వద్ద కాలువలో పడి నీటిలో కొట్టుకుని పోయింది. 
 
దీన్ని గుర్తించిన స్థానికులు ఆ కారులో చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేశారు. కానీ వారిలో గంగ (40), కిట్టు (4) అనే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.