1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 28 మే 2021 (11:44 IST)

వేధింపులకు గురైన కరాటే కళ్యాణి.. ఎంపీనని ఫోన్ చేసి.. పెళ్లి అయ్యిందా అంటూ?

కరాటే కళ్యాణి వేధింపులకు గురయ్యారు. ఒడిశా ఎంపీనంటూ ఓ వ్యక్తి ఫోన్ కాల్ చేసి వేధించినట్లు కరాటే కళ్యాణి ఆరోపించారు. తాను మూడు సార్లు ఎంపీగా గెలిచానని.. మీ సేవా కార్యక్రమాలు బాగున్నాయని మాట్లాడారట. ఏదైనా సాయం కావాలంటే చెప్పు.. కోట్లైనా ఇస్తానని ఆఫర్ చేశారట.
 
ఒక్కడే గొంతు మార్చి తనతో పలు మార్లు మాట్లాడానని కళ్యాణి చెప్పారు. 10 సార్లు ఫోన్ చేసి విసిగించిన తర్వాత..మీకు పెళ్లయిందా? అని అడిగారని ఆమె పేర్కొన్నారు. తనకు విషయం అర్ధమై ఫోన్ కట్ చేసినట్లు వెల్లడించారు.
 
తన ఫోన్ నెంబర్ కోసం బీజేపీ నేతలు విజయశాంతి, డీకే అరుణను అడిగానని.. తనపై ఆయనకు ఎందుకో అంత స్పెషల్ ఇంట్రెస్ట్ అని ఫేస్‌బుక్‌లో కరాటే ప్రశ్నించారు. మీకు బీజేపీలో ఏదో పదవి ఉందనుకున్నా అంటూ మాట కలిపాడని.. తాను ఇప్పుడు ఏ పార్టీలో లేనని స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు.
 
సమాజంలో ఇలాంటి వారు చాలా మంది ఉంటారు..తస్మాత్ జాగ్రత్త అని తన అభిమానులను హెచ్చరించారు కరాటే కల్యాణి. ఎవ్వరినీ నమ్మవద్దని సూచించారు. తనతో పెట్టుకుంటే బాజా బారాత్ అంటూ ఆ వ్యక్తికి కూడా వార్నింగ్ ఇచ్చారు. 
 
ఐతే ఆమెకు కాల్ చేసింది నిజంగానే ఒడిశా ఎంపీయా? లేదంటే ఎంపీ పేరుతో ఎవరైనా ఆకతాయి కాల్ చేశాడా? అన్నది తెలియాల్సి ఉంది. ఏదేమైనా కరాటే కళ్యాణి ఫేస్‌బుక్ పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.