1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 మార్చి 2020 (13:08 IST)

కనికాకు నాలుగోసారి పాజిటివ్... ఆందోళనలో ఫ్యామిలీ మెంబర్స్

దేశంలో కరోనా వైరస్ బారినపడినవారిలో బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈమెను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటివరకు ఆమెకు నాలుగుసార్లు కరోనా పరీక్షలు నిర్వహించగా, ఈ నాలుగుసార్లూ పాజిటివ్ అని వచ్చింది. దీంతో ఆమెను ఇంటికి డిశ్చార్జ్ చేసేందుకు వైద్యులు ససేమిరా అంటున్నారు. దీంతో ఆమె కుటుబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 
 
తాజాగా గాయని కనికా కపూర్‌కు నాలుగోసారి రక్తపరీక్షలు నిర్వహించారు. ఇందులో కూడా పాజిటివ్ అని తేలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆమె భావోద్వేగాన్ని వ్యక్తం చేసింది. తాను ఐసీయూలో లేనని... తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందిన అందరికీ ధన్యవాదాలు అని తెలిపింది. 
 
తదుపరి పరీక్షలో తనకు నెగెటివ్ వస్తుందని ఆశిస్తున్నానని చెప్పింది. తన పిల్లలు, కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు వేచి చూస్తున్నానని తెలిపింది. వారిని ఎంతగానో మిస్ అవుతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది.
 
కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ఈ నెల 20వ తేదీన కనికాను ఆసుపత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే. మార్చి 23, 27 తేదీల్లో నిర్వహించిన టెస్టుల్లో కూడా పాజిటివ్ అని తేలింది. ఆమెపై పోలీసు కేసు కూడా నమోదైంది.