శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 19 ఆగస్టు 2020 (17:14 IST)

రోడ్డు ప్రమాదం: అర్జున్ రెడ్డి సినిమా డిస్ట్రిబ్యూటర్ కమలాకర్ రెడ్డి మృతి

Kamalakar Reddy
ఒకవైపు కరోనా.. మరోవైపు రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే నిర్మాతలు, దర్శకులు, నటులు, గాయకులు కరోనా సోకడంతో నానా తంటాలు పడుతున్నారు. తాజాగా తెలుగు బ్లాక్ బస్టర్ చిత్రాలు ‘అర్జున్‌రెడ్డి’, ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాలకు డిస్ట్రీబూటర్‌, కేఎఫ్‌సీ నిర్మాణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌లలో ఒకరైన గుండాల కమలాకర్‌రెడ్డి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లాలో నివాసముంటున్న కమలాకర్‌రెడ్డి ఆయన తండ్రి నందగోపాల్‌రెడ్డి (75) ఇటీవల కరోనా బారిన పడ్డారు. ఆయనను హైదరాబాద్‌లోని ఆస్పత్రికి అంబులెన్స్‌లో తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో అంబులెన్స్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అంబులెన్స్ డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 
ఇకపోతే రోడ్డు ప్రమాదంలో తండ్రీకుమారులు ఇద్దరూ మృత్యువాత పడటడంతో వారి కుటుంబం విషాదం నెలకొంది. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఇటీవల విడుదలైన ''కనులు కనులు దోచాయంటే'' సినిమాను కేఎఫ్‌సి ఎంటర్‌టైన్మెంట్ సంస్థ విడుదల చేసింది. ఈ సినిమాకు కమలాకర్‌రెడ్డి కో ప్రోడ్యూసర్‌గా వ్యవహరించారు. అలాగే తెలుగు, హిందీ, తమిళ డబ్బింగ్‌ సినిమాలకు కూడా ఆయన డిస్ట్రిబుటర్‌గా వ్యవహరించారు.