శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 14 అక్టోబరు 2018 (14:11 IST)

కాళ్లు వెడ‌ల్పు చేసి లంగాపైకి జ‌రిపి న‌వాజుద్దీన్‌పై ప‌డుకో...

బాలీవుడ్ చిత్రపరిశ్రమలో 'మీటూ' ఉద్యమం ప్రకంపనలు కురిపిస్తోంది. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ చిత్రాంగద సింగ్ ఓ సంచలన విషయాన్ని వెల్లడించింది. బాలీవుడ్ చిత్రపరిశ్రమలో ఆమె ఎదుర్కొన్న అనుభవాలను వెల్లడించారు. ముఖ్యంగా, బాలీవుడ్ నటుడు న‌వాజుద్దీన్ సిద్ధిఖీ హీరోగా న‌టించిన 'బాబూ మ‌షాయ్‌' సినిమా షూటింగ్ స‌మ‌యంలో తానెదుర్కొన్న వేధింపులను గురించి తాజాగా బ‌య‌ట‌పెట్టింది. ఫలితంగా ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని తెలిపింది.
 
దీనిపై ఆమె స్పందిస్తూ, 'ఆ సినిమా షూటింగ్ స‌మ‌యంలో ద‌ర్శ‌కుడు కుషాన్ నంది నాతో చాలా అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించాడు. న‌వాజుద్దీన్‌తో క‌లిసి మంచంపై ఓ సీన్ చేయాల్సి వ‌చ్చింది. ఆ సీన్ సంద‌ర్భంగా బ‌ట‌న్స్ లేని జాకెట్ నా చేత తొడిగించాడు. ఆ సీన్ షూటింగ్ జ‌రుగుతున్న‌పుడు డైరెక్ట‌ర్ నా వ‌ద్ద‌కు వ‌చ్చి 'కాళ్లు వెడ‌ల్పు చేసి లంగాపైకి జ‌రిపి న‌వాజుద్దీన్‌పై ప‌డుకో' అని చెప్పాడు. 
 
'నేను ఆ సీన్ చేయ‌న‌ని చెప్పినా విన‌లేదు. అక్క‌డే ఉన్న నవాజుద్దీన్ కూడా దర్శకుడుని వారించ‌లేదు. పైగా 'ఈ సినిమాలో ఓ సీన్ షూటింగ్ స‌మ‌యంలో రెండు సార్లు మ‌జా చేశాను' అని ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పాడు. అలాంటి సీన్లు చేయ‌లేకే సినిమా నుంచి త‌ప్పుకున్నా అని చిత్రాంగద చెప్పుకొచ్చింది.