గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 డిశెంబరు 2021 (11:31 IST)

రాజమండ్రిలో సినిమా థియేటర్ల యజమానుల భేటీ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి పట్ల రాష్ట్రంలోని సినిమా థియేటర్స్ యాజమాన్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకే టిక్కెట్లు విక్రయించాలంటూ షరతు విధించారు. ఈ ధరలకు సినిమాలను ప్రదర్శించలేమని అనేక థియేటర్లు స్వచ్చంధంగా మూసివేస్తున్నారు. అలాగే, సదుపాయాల లేమి నేపథ్యంలో రెవెన్యూ అధికారులు థియేటర్లలో ముమ్మరంగా తనిఖీలు చేస్తూ థియేటర్ యజమానుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో టిక్కెట్ ధరల తగ్గింపు, థియేటర్లతో పాటు ప్రస్తుతం యావత్ చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై సోమవారం రాజమండ్రి వేదికగా సినిమా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, సినిమా థియేటర్ యజమానుల జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరుగనుంది. ఇందులో అన్ని అంశాలపై చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 
 
కాగా, సినిమా టిక్కెట్ల వ్యవహారంపై హైకోర్టులో ఇప్పటికే విచారణ జరుపుతోంది. సోమవారం ఇదే అంశంపై మరోమారు కోర్టులో విచారణ జరుగనుంది. ఈ నేపథ్యంలో వీరి భేటీ ఇపుడు ప్రాధాన్యత సంతరించుకుంది.